జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కింద ఏర్పాటైన పథకాలు
గర్భధారణ సమస్యల మూలంగా దేశంలో ఏటా 56,000 మంది మహిళలు మృతి
చెందుతున్నారు. సుమారు 13 లక్షల మంది చిన్నారులు సంవత్సరంలోపే మృత్యువాత
పడుతున్నారు. ఇందులో 9 లక్షల మంది నెలలోపే మరణిస్తున్నారు. వీటిని
తగ్గించడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్లో భాగంగా వివిధ పథకాలను
ప్రారంభించారు.జననీ సురక్షా కార్యక్రమం
అవసరమైతే ఉచిత సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు. ఔషధాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ఏడు రోజులు ఉచితంగా ఆహారం అందిస్తారు. సాధారణ ప్రసవం సందర్భంలో మూడు రోజుల పాటు ఉచిత ఆహారాన్ని అందజేస్తారు.
మాతా సంరక్షణ కోసం ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రసవాలను ఉచితంగా నిర్వహిస్తారు.
గర్భిణులను ఆసుపత్రికి తీసుకువచ్చిన దగ్గర నుంచి ప్రసవానంతరం ఇంటికి సురక్షితంగా చేరుస్తారు. |
1995లో
ప్రారంభించిన జాతీయ మాతృ ప్రయోజన కార్యక్రమానికి కొన్ని మార్పులు చేస్తూ
2005, ఏప్రిల్లో జననీ సురక్షా యోజనను ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. మొత్తం ప్రసవాల్లో 25% కంటే తక్కువగా ఆసుపత్రుల్లో జరిగే రాష్ట్రాలను తక్కువ సామర్థ్య రాష్ట్రాలుగా వర్గీకరించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతినెలా 'ఆశా' ఆరోగ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తారు.
శిశు సంరక్షణ పథకాలు నవజాత శిశువుల సంరక్షణకు 'న్యూ బార్న్ బేబీ కార్నర్స్'ను ఏర్పాటు చేశారు. నవజాత శిశు సురక్షా కార్యక్రమాన్ని కూడా ఇదే లక్ష్యంతో ప్రారంభించారు. ప్రసవ సమయంలో అప్రమత్తంగా ఉంటారు. దీనికోసం ఎంపిక చేసిన సిబ్బందికి ముందుగానే రెండు రోజులు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారు ప్రసవ సమయంలో అప్పుడే పుట్టిన చిన్నారులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలునేషనల్ వెక్టర్ బార్, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం మలేరియా, డెంగీ, ఫైలేరియా, కాలా అజార్, జపనీస్ ఎన్ సెఫలైటిస్, చికున్గన్యా లాంటి రోగాల నివారణకు ఈ పథకాన్ని రూపొందించారు.
నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రాం పొగాకు సంబంధిత, నోరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను నివారించడానికి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ఈ పథకాన్ని 1985లో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ట్యుబర్క్యులోసిస్, డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్ లాంటి 6 వ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు అందిస్తారు.నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాం 1992లో నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రాంను నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాంగా మార్చారు. అందరికీ అయోడిన్ ఉప్పు అందించడం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. అయోడిన్ లోప నివారణలకు ఉద్దేశించిన పథకమిది
అంటువ్యాధులు
శారీరక లేదా మానసిక అస్వస్థతను వ్యాధి అంటారు. అంటువ్యాధులు ఒకరి నుంచి
మరొకరికి సంక్రమిస్తాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో
అంటువ్యాధులు, పోషకాహార లోపం వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారు.
అంటువ్యాధులు వ్యక్తుల నుంచి వ్యక్తులకు లేదా జంతువుల నుంచి మనుషులకు సూక్ష్మజీవులు, కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. రోగకారక క్రిముల ఉత్పత్తి స్థానాలను నిర్మూలించి, వాటి ప్రసార మార్గాలను ఆటంకపరచి, మానవుల వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టి పూర్తిగా నిర్మూలించవచ్చు.ప్రత్యక్ష తాకిడి వాల్ల వ్యాపించే సంక్రమిత వ్యాధులు
|
No comments:
Post a Comment