|
జీవో. ఆర్.టి.నెం. 205 /యమ్.హెచ్ అండ్ యఫ్, డబ్ల్యు (డి1) డిపార్ట్ మెంట్, తేది 3.1.2004
బాలల హక్కుల పరిరక్షణకై గ్రామ పంచాయితీల బాధ్యతల
ప్రస్తుతం మనదేశంలో చాలా మంది బాలలు హక్కులు
కోల్పోయి దీనావస్ధలో ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా చాలా మంది బాలబాలికలు
అన్ని జిల్లాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ బాలలు పొలం పనులు,
కూలి పనులు, నేత పనులు, ఇంటి పనులు, హాటల్, గ్యారేజీల్లో, గేదేలు, మేకల
వద్ద పనులు చేస్తూ నిరంతరం వారి హక్కులను కోల్పోయి జీవిస్తున్నారు.
ఇంట్లో పనివాళ్ళగా లేదా దాబాలు, రెస్టారెంట్లు, హాటళ్ళు, టీ దుకాణాలు లేదా
ఇతర వినోద కేంద్రాల్లో 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకొనుట 10
అక్టోబరు 2006 నుండి నిషేధించబడింది. పిల్లలను ఈ వృత్తుల్లో ఎవరైనా
పెట్టుకుంటే ఒక సంవత్సరం కారాగారా శిక్షకు మరియు (లేదా) జరిమానాకు
బాధ్యులగుదురు.
పలుచోట్ల బాలల పైన దౌర్జన్యాలు, లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలలు
వారి హక్కులను కోల్పోయి వీధుల్లో తిరుగుతున్నారు. గ్రామ పంచాయితీలు బాధ్యత
వహించి బాలలందరు బడిలో ఉండేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ బాలల
భవిష్యత్తుకు రూపకల్పన చేసి వారి జీవితాలను మెరుగు పరిచేందుకు
ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించాలి.
- బాలల హక్కుల సంరక్షణ కోసం గ్రామ పంచాయితీ స్ధాయిలో ఎంపిక చేయబడిన
కూలీల ప్రతినిధులు (లేబర్ యూనియన్స్) కార్మిక సంఘాలు, మహిళ మండలి, సెల్ఫ్
హెల్ప్ గ్రూపులు, గ్రామ పంచాయితీ ప్రతినిధులు అంగన్ వాడీ కార్యకర్తలు,
సమాజ సేవకులు మరియు బాలల హక్కుల కోసం పాటుపడే యువతకు శిక్షణ ఇచ్చి వారి
ద్వారా బాలల హక్కుల సంరక్షణకు పాటు పడటం.
- బాలల హక్కుల పరిరక్షణ సంస్ధలు గ్రామంలోని పాఠశాలలోని సమస్యలను
గుర్తించి వాటిని పరిష్కరించటంలో మార్గాన్ని ఆలోచింపజేసి సంబంధిత అధికారుల
దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించుకొనుట.
- ప్రతి గ్రామ పంచాయితీలో బాలల హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకొనుటకు
బాలలకు, యువతకు శిక్షణ ఇచ్చి బాలల సంఘాలను బలోపేతం చేయటం.
- గ్రామ పంచాయితీ స్ధాయిలో ఉన్న బాలల పక్కుల సంఘాల కార్యక్రమాలు
చేపట్టడం మరియు పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా ఆ సంఘ ప్రతినిధులకు శిక్షణలు
ఇవ్వడం.
- బాలల సంఘాలకు, బాలల హక్కులు గురించి ప్రచారం నిర్వహిస్తూ బాలలందరిని
స్కూల్ కి వచ్చే విధంగా, బాలల సమస్యలను వారే చర్చించుకుని, వారి
అభిప్రాయాలను వ్యక్తపరచుకొనుటకు వేదికలు ఏర్పాటుచేయడం
-
- ప్రేమ, నమ్మకం
- వాత్సల్యము, స్నేహం
- రక్షణ
- బాల్యం
- శిక్షణ
- పోషణ, వసతి
- ఆరోగ్యం, పౌష్టికాహారం
- ఆటపాటలు, మంచితనం
- భాగస్వామ్యం పొందుట
- అభిప్రాయాలకు అవకాశం
- వినోదం, సంతోషం
|
|
-
- బాలల చదువు కోసం గ్రామ పంచాయితీలు కృషి చేయాలి.
- గ్రామ పంచాయితీ గ్రామంలోని అంగన్ వాడి స్కూల్ వివరాలు సేకరించి
ఉంచుకోవాలి
- స్కూల్ బిల్డింగ్, అంగన్ వాడి బిల్డింగ్ సమస్యను గుర్తించి దానిని
పూర్తి చేయుటకు ప్రయత్నించాలి.
- అంగన్ వాడి స్కూల్ కు సంబంధించిన పనులను ఆయా అధికారులతో చర్చించి ఆ
పనులను పూర్తి చేయాలి.
- బాలల హాజరు, టీచర్స్, వాళ్ళ వర్క్ ప్రాబ్లమ్ గురించి అంగన్ వాడి
స్కూల్ అభివృద్ధి కమిటీ వాకబు చేస్తుండాలి.
- గ్రామ పంచాయితీల ద్వారా గ్రామంలోని అంగన్ వాడి పాఠశాలలతో సంబంధాలను
పెంపొందించుకోవాలి.
- బాల కార్మికవ్యవస్ధ లేని పంచాయితీగా తీర్చిదిద్దేందుకు
ప్రయత్నించాలి
|
జవహర్ బాల ఆరోగ్య రక్ష
జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే పేరుతో
రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 14, 2010 నాడు ప్రభుత్వం పాఠశాల ఆరోగ్య
కార్యక్రమాలను ప్రారంభించాలని ఇందుమూలంగా ఆదేశాలను జారీ చేసింది.
కార్యనిర్వహణలో జవహర్ బాల ఆరోగ్య రక్ష (జె.బి.ఏ.ఆర్) అన్న పేరు పిల్లల
ఆరోగ్యాభివృధ్ది పధకం (చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్ - చిప్)
గా వ్యవహరంచబడుతుంది.
-
a) పాఠశాలలలో చదివే పిల్లలందరికి ఆరోగ్య పరిక్షలు, దీనితో పాటుగా
పిల్లల ఆరోగ్య రికార్డు (ఎస్.హెచ్.ఆర్) ను కూడా జారీ చేయడం.
b) 5 – 7 సంవత్సరాల వయస్సు కల పిల్లలందరికి డి.పి.టి. బూస్టర్ టీకాలను
వేయడం. అలాగే, 10 – 15 సంవత్సరాల వయస్సు కల పిల్లలకు టి.టి. బూస్టర్ ను
ఇవ్వడం.
c) కడుపులో పాములు పెరగకుండా నివారించే మందును, అలాగే విటమిన్ ఏ మరియు
డి ను సంవత్సరానికి రెండుసార్లు పిల్లలందరికి ఇవ్వడం మరియు రక్తపులేమితో
బాధపడుతూ వుండే పిల్లలకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ బిళ్లలను ఇవ్వడం.
d) చిన్న చిన్న వ్యాధులన్నింటికి - అంటే పోషకాహారలోపం, స్కేబీస్ వంటి
చర్మవ్యాధులు మరియు తలలో పేలు రావడం వంటి వాటికి చికిత్స చేయడం.
e) మాధ్యమిక మరియు తృతీయ ఆరోగ్య పరిరక్షణ కావలిసిన పిల్లలను సరైన
సౌకర్యాలున్నచోట ప్రత్యేక సమీక్ష, సరైన దర్యాప్తులు, వ్యాధులకు చికిత్సకై
పంపడం మరియు ఈ చికిత్సావిధానాన్ని అనుసరిస్తూ, పాటిస్తూ ఉండడం.
f) వ్యాధుల నివారణలోను మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడాన్ని ఆరోగ్య
విద్యను, జీవితనైపుణ్యాలను మరియు ఆచరణీయమైన పాఠాలను సమైక్యం చేయడం.
g) ఉపాధ్యాయులకు మరియు పాఠశాలలో పనిచేసే ఇతరులకు ఆరోగ్య చెక్ అప్ మరియు
ఆరోగ్య మెరుగుదలతో పోషకాహార విద్యను సమైక్యం చేయడం.
ఈ జవహర్ బాల ఆరోగ్య రక్ష రాష్ట్రంలో 46,823 ప్రభుత్వ మరియు ప్రభుత్వ
ఎయిడెడ్ పాఠశాలలో చదువుతూ వుండే 85,32,635 మంది విద్యార్ధులకు
వర్తిస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ముందే విద్యార్ధులందరికి
పరీక్షలు చేయడం, అలాగే ఇప్పటికే వ్యాధులతో ఉన్నవారిని కూడా తగిన పైద్య
చికిత్సకు పంపడం (రిఫరల్) పూర్తవుతుంది. దీని వెంటనే మండల మరియు జిల్లా
స్ధాయిలలో పూర్తి చేయబడే ఒక వివరణాత్మకమైన షెడ్యూలును తయారుచేయడం
జరుగుతుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి) వైద్య అధికారి
నేతృత్వంలో ఒక పేరా మెడికల్ బృందం, ఒక నేత్ర సంబంధిత అధికారితో సహా, ఒక
ఆరోగ్య బృందం ప్రతి పాఠశాలతో పాటుగా, పాఠశాలలోచదివే పిల్లలు అందరిని
పరిక్ష చేయడానికి ముందుగా నియమించిన షెడ్యూల్ ను అనుసరిస్తూ 1 డిసెంబరు
2010 మరియు 10 మార్చి 2011 మధ్య కాలంలో సందర్శిస్తుంది.
వైద్యునిచే శారీరక పరీక్షలు వివరంగా నిర్వహింపబడిన తరువాత ప్రతి
ఒక్కరికి విద్యార్ధుల ఆరోగ్య రికార్డు (స్టూడెంట్ హెల్త్ రికార్డ్ –
ఎస్.హెచ్.ఆర్) ఇవ్వబడుతుంది. 5 సంవత్సరాల వరకూ చెల్లుబాటు అయ్యే ఈ
ఎస్.హెచ్.ఆర్. ఒక పరిపూర్ణమైన డాక్యుమెంట్ లాంటిది. విద్యార్ధుల జీవితంలో
చోటు చేసుకునే ఆరోగ్య పరిణామాలు ఇందులో పొందుపరుస్తూ, ఈ ఎస్.హెచ్.ఆర్.
పాఠశాల ఉపాధ్యాయుని వద్ద జాగ్రత్తగా ఉంచబడి ఎపుడైనా విద్యార్ధికి గాని,
అతని తలిదండ్రులకు గాని వారి పిల్లలను ఆసుపత్రికి పంపవలసి వచ్చినప్పుడు
వారికి ఇవ్వబడుతుంది. తదుపరి వ్యాధి నిర్ధారణకు మరియు చికిత్సకు అన్నీ
ఏ.పి.వి.వి.పి. మరియు విద్యాబోధన చేయు ఆసుపత్రులలోను ఈ ఎస్.హెచ్.ఆర్. ను
తనతో తీసుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి కూడా వ్యాధి దర్యాప్తునందు మరియు
చికిత్సలోనూ ప్రాధాన్యత నివ్వబడుతుంది. ఈ పాఠశాల విద్యార్ధులకోసం ఒక
కౌంటర్ ను విడిగా నెలకొల్పి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వీరికోసం ఒక
రిజిస్టరును కూడా విడిగా ఉంచడం జరుగుతుంది. విటమిన్ ఏ మరియు డి లను ఇవ్వడం
మరియు పిల్లల కడుపులో పాములు రాకుండా నివారించడంతో పాటుగా చిన్న చిన్న
వ్యాధులు ఏమైనా వుంటే వాటిపై పరిక్షలు నిర్వహించే వైద్యునిచేతనే
చికిత్సలను చేయించడం కూడా జరుగుతుంది. |
అందరికీ విద్య
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి
ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా
చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు.
అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో
భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక
విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు
పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు
మనందరిపైన ఉంది. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21
ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైనది. ఆర్టికల్ 51 ఎ
ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు తమ పిల్లలకు 6
నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించటం
ప్రాథమిక విధిగా పేర్కొనబడినది. దీనిలో భాగంగానే 6 – 14 సంవత్సరాల
వయస్సులోని బాలలందరికీ విద్యను అందించడానికి ఉచిత నిర్బంధ విద్యకు బాలల
హక్కు చట్టం, 2009 ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం
ఏప్రియల్ ఒకటి 2010 నుండి భారతదేశమంతటా (జమ్ముకాశ్మీర్ మినహా) అమలులోకి
వచ్చింది.
విద్యాహక్కు చట్టం అమలు ద్వారా పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించుటకు
మరియు సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధన కోసం భారత ప్రభుత్వం సర్వ శిక్షా
అభియాన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాల అమలుకు
సహకరించి ఎలిమెంటరీ విద్యాసాధనకు మనవంతు కృషి చేద్దాం.
-
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పాఠశాల విద్యాశాఖ నియంత్రణలో ఉన్న అన్ని
పాఠశాలలకు చెందిన అంశములకు సంబంధించిన అధికారాలు, బాధ్యతలను పంచాయితీరాజ్
సంస్థలకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 2 తేది 03.02.2008 ద్వారా బదలాయింపు
చేయడం జరిగింది.
పంచాయితీరాజ్ సంస్థలను పునరుజ్జీవం మరియు బలోపేతం చేయడానికై ఈ చట్టం
నిర్దేశింపబడినది. ఈ సవరణ పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను, బాధ్యతలను
బదలాయించే అవకాశం కల్పించింది. మరియు పంచాయితీలు సామాజిక న్యాయం,
ఆర్థికాభివృద్ధి కొరకు, ప్రణాళికల రచన కొరకు ఉద్దేశించిన పథకాల అమలులో
స్వయం పరిపాలన సంస్థలుగా పనిచేయగలుగుతాయి.
- రాజ్యాంగ అమలులోని స్పూర్తిని ప్రతిబింబించే విధంగా ఆంధ్రప్రదేశ్
పంచాయితీరాజ్ చట్టం 1994 చేయబడింది.
- భారత ప్రభుత్వం పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, పంచాయితీరాజ్ సంస్థలకు
అధికారాలను బదిలీ చేసే సవివరమైన ప్రణాళిక చేయుటకు 7వ రౌండు టేబుల్ సమావేశం
చేసింది.
ఈ చట్ట సవరణ ఆధారంగా ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో పంచాయితీ విద్యా
ఉపకమిటీని ఏర్పాటు చేయాలి.
-
ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలోని పంచాయితీ విద్యా ఉపకమిటీని గ్రామ
సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మహిళ వార్డు సభ్యులతో
ఒకరు వైస్ చైర్మెన్ గాను, మరొకరు సభ్యులుగాను మరియు షెడ్యుల్డ్ కులాలు /
తెగలు లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇద్దరు వార్డు సభ్యులు ఈ
కమిటీలో సభ్యులుగా ఉంటారు.
|
|
-
- గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరు
- పాఠశాల సిబ్బంది రోజు వారి హాజరు
- పిల్లల విద్యా ప్రమాణాలు
- పాఠశాల మౌళిక సదుపాయాలు
- మధ్యాహ్న భోజనం పథకం సక్రమ అమలు మొదలగు వాటిని పర్యవేక్షించే అధికారం
కలిగి ఉంటుంది.
|
|
-
ఉపకమిటీ ప్రతి శనివారం, ఒకవేళ శనివారం సెలవుదినమైతే ఆ ముందు రోజు
సమావేశం నిర్వహిస్తుంది. సమావేశానికి గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్
ఉపాధ్యాయులు పాల్గొంటారు.
|
|
|
|
-
6 నుండి 14 సం|| ల గల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి
పార్లమెంట్ చేసిన విద్యాహక్కు చట్టం 2009 ఆగష్టు 26న రాష్ట్రపతి ఆమోదం
పొంది, ఏప్రియల్ ఒకటి 2010 నుండి భారత దేశమంతటా అమలులోనికి వచ్చింది.
దీనినే Right to Education Act అని కూడా అంటారు.
|
|
-
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి
ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా
చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు.
అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో
భాగస్వాములైతే ప్రాధమిక స్థాయి విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే
గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు
పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు
మనందరిపైన ఉంది.
- ఆర్టికల్ 51 ఎ ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు
తమ పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు
కల్పించటం ప్రాథమిక విధి.
- అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను
ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించినది.
- దీనిలో భాగంగా ఉచిత, నిర్బంధ ఎలిమెంటరీ విద్యకొరకు కేంద్రప్రభుత్వం
విద్యహక్కు బిల్లును 29 ఆగష్టు 2009 న ఆమోదించింది. దీనికి అనుగుణంగా
విద్యహక్కుచట్టం 2009 ఏప్రియల్ ఒకటి 2010 నుండి జమ్ము- కాశ్మీర్ మినహా
దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
-
- సార్వత్రిక విద్యా సాధనకు మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ పేరిట
సర్వశిక్ష అభియాన్ ద్వారా కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి.
- బడిఈడు గల బాలలందరూ 2010 – 11 విద్యా సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్య (
8వ తరగతి వరకు) ను పూర్తి చేసేలా కృషి చేయడం.
- ఇందుకోసం నాణ్యతతో కూడిన ప్రయోజనకరమైన ఎలిమెంటరీ విద్య పై ప్రత్యేక
దృష్టిని కేంద్రీకరించడం.
- 2010 – 11 సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్య స్ధాయిలో, బాలురు, బాలికలు
మధ్య వివక్షతను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలను తొలగించడం.
- 2010 – 11 విద్య సంవత్సరంలోగా సార్వత్రిక నిలుపుదలను సాధించడం.
|
|
|
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి
ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా
చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు.
అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో
భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక
విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు
పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు
మనందరిపైన ఉంది. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21
ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైనది. ఆర్టికల్ 51 ఎ
ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు తమ పిల్లలకు 6
నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించటం
ప్రాథమిక విధిగా పేర్కొనబడినది. దీనిలో భాగంగానే 6 – 14 సంవత్సరాల
వయస్సులోని బాలలందరికీ విద్యను అందించడానికి ఉచిత నిర్బంధ విద్యకు బాలల
హక్కు చట్టం, 2009 ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం
ఏప్రియల్ ఒకటి 2010 నుండి భారతదేశమంతటా (జమ్ముకాశ్మీర్ మినహా) అమలులోకి
వచ్చింది.
విద్యాహక్కు చట్టం అమలు ద్వారా పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించుటకు
మరియు సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధన కోసం భారత ప్రభుత్వం సర్వ శిక్షా
అభియాన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాల అమలుకు
సహకరించి ఎలిమెంటరీ విద్యాసాధనకు మనవంతు కృషి చేద్దాం.
-
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పాఠశాల విద్యాశాఖ నియంత్రణలో ఉన్న అన్ని
పాఠశాలలకు చెందిన అంశములకు సంబంధించిన అధికారాలు, బాధ్యతలను పంచాయితీరాజ్
సంస్థలకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 2 తేది 03.02.2008 ద్వారా బదలాయింపు
చేయడం జరిగింది.
పంచాయితీరాజ్ సంస్థలను పునరుజ్జీవం మరియు బలోపేతం చేయడానికై ఈ చట్టం
నిర్దేశింపబడినది. ఈ సవరణ పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను, బాధ్యతలను
బదలాయించే అవకాశం కల్పించింది. మరియు పంచాయితీలు సామాజిక న్యాయం,
ఆర్థికాభివృద్ధి కొరకు, ప్రణాళికల రచన కొరకు ఉద్దేశించిన పథకాల అమలులో
స్వయం పరిపాలన సంస్థలుగా పనిచేయగలుగుతాయి.
- రాజ్యాంగ అమలులోని స్పూర్తిని ప్రతిబింబించే విధంగా ఆంధ్రప్రదేశ్
పంచాయితీరాజ్ చట్టం 1994 చేయబడింది.
- భారత ప్రభుత్వం పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, పంచాయితీరాజ్ సంస్థలకు
అధికారాలను బదిలీ చేసే సవివరమైన ప్రణాళిక చేయుటకు 7వ రౌండు టేబుల్ సమావేశం
చేసింది.
ఈ చట్ట సవరణ ఆధారంగా ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో పంచాయితీ విద్యా
ఉపకమిటీని ఏర్పాటు చేయాలి.
-
ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలోని పంచాయితీ విద్యా ఉపకమిటీని గ్రామ
సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మహిళ వార్డు సభ్యులతో
ఒకరు వైస్ చైర్మెన్ గాను, మరొకరు సభ్యులుగాను మరియు షెడ్యుల్డ్ కులాలు /
తెగలు లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇద్దరు వార్డు సభ్యులు ఈ
కమిటీలో సభ్యులుగా ఉంటారు.
|
|
-
- గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరు
- పాఠశాల సిబ్బంది రోజు వారి హాజరు
- పిల్లల విద్యా ప్రమాణాలు
- పాఠశాల మౌళిక సదుపాయాలు
- మధ్యాహ్న భోజనం పథకం సక్రమ అమలు మొదలగు వాటిని పర్యవేక్షించే అధికారం
కలిగి ఉంటుంది.
|
|
-
ఉపకమిటీ ప్రతి శనివారం, ఒకవేళ శనివారం సెలవుదినమైతే ఆ ముందు రోజు
సమావేశం నిర్వహిస్తుంది. సమావేశానికి గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్
ఉపాధ్యాయులు పాల్గొంటారు.
|
|
|
|
-
6 నుండి 14 సం|| ల గల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి
పార్లమెంట్ చేసిన విద్యాహక్కు చట్టం 2009 ఆగష్టు 26న రాష్ట్రపతి ఆమోదం
పొంది, ఏప్రియల్ ఒకటి 2010 నుండి భారత దేశమంతటా అమలులోనికి వచ్చింది.
దీనినే Right to Education Act అని కూడా అంటారు.
|
|
-
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి
ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా
చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు.
అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో
భాగస్వాములైతే ప్రాధమిక స్థాయి విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే
గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు
పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు
మనందరిపైన ఉంది.
- ఆర్టికల్ 51 ఎ ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు
తమ పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు
కల్పించటం ప్రాథమిక విధి.
- అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను
ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించినది.
- దీనిలో భాగంగా ఉచిత, నిర్బంధ ఎలిమెంటరీ విద్యకొరకు కేంద్రప్రభుత్వం
విద్యహక్కు బిల్లును 29 ఆగష్టు 2009 న ఆమోదించింది. దీనికి అనుగుణంగా
విద్యహక్కుచట్టం 2009 ఏప్రియల్ ఒకటి 2010 నుండి జమ్ము- కాశ్మీర్ మినహా
దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
-
- సార్వత్రిక విద్యా సాధనకు మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ పేరిట
సర్వశిక్ష అభియాన్ ద్వారా కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి.
- బడిఈడు గల బాలలందరూ 2010 – 11 విద్యా సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్య (
8వ తరగతి వరకు) ను పూర్తి చేసేలా కృషి చేయడం.
- ఇందుకోసం నాణ్యతతో కూడిన ప్రయోజనకరమైన ఎలిమెంటరీ విద్య పై ప్రత్యేక
దృష్టిని కేంద్రీకరించడం.
- 2010 – 11 సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్య స్ధాయిలో, బాలురు, బాలికలు
మధ్య వివక్షతను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలను తొలగించడం.
- 2010 – 11 విద్య సంవత్సరంలోగా సార్వత్రిక నిలుపుదలను సాధించడం.
|
|
|
|
-
పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న బాల బాలికందరికి అన్ని విషయాలలో
ఆశించిన సామర్థ్యాలు సాధించడం ద్వారా గుణాత్మక విద్యను అందించటం సర్వ
శిక్షా అభియాన్ లక్ష్యం.
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం బాలల సర్వతోముఖాభివృద్ధి
జరగాలంటే సాధ్యమైనంత వరకు బోధనామాధ్యమం బాలల మాతృభాషగా ఉండాలి.
- బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులను పెంపొందే బోధన
జరగాలి.
- పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన బోధనా పద్ధతుల్లో
కార్యక్రమాలు, పరిశోధనలు, కనుగొనటం ద్వారా నేర్చుకొవాలి.
- భయాలు, ఆందోళనల వంటి వాటి నుంచి బాలలను విముక్తి చేసి వారు తమ భావాలను
స్వేచ్ఛగా వ్యక్తీకరించటంలో సహాయపడాలి.
- జ్ఞానాన్ని బాలలు అర్ధం చేసుకున్న విధానం, దానిని అన్వయించే
సామర్థ్యాలపై నిరంతర సమగ్రమూల్యాంకన జరగాలి.
- ప్రస్తుత పాఠశాలల్లో అమలవుతున్న అభ్యసనాభివృద్ధి కార్యక్రమం
(ఎల్.ఇ.పి) ద్వారా విద్యార్ధి, తరగతి మరియు పాఠశాల వారీగా గ్రేడింగ్
నిర్ణయించి విద్యార్ధుల అభివృద్ధికై కృషి జరగాలి. పాఠశాలలో 1,2, 3 తరగతి
పిల్లల కొరకు స్నేహ బాల కార్డులు ద్వారా బోధన జరగాలి. విద్యాబోధనలో
నిరంతరం కొత్తదనాన్ని చూపిస్తూ..... పిల్లల జ్ఞాన సమపార్జనే లక్ష్యంగా
ముందు కెళితే గుణాత్మకతను సాధించవచ్చును.
|
|
-
విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుండి 14సం11 లోపు వయసు గల పిల్లలందరికీ
విద్యనందించడం రాజీవ్ విద్యామిషన్ ప్రధాన లక్ష్యం. ఈ వయసులోని బడిబయట
పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు రాజీవ్ విద్యామిషన్ వివిధ రకాల
వ్యూహాలను చేస్తోంది.
బడిబయట పిల్లల్లో ప్రధానంగా అసలు బడికి పోనివారు, మధ్యలో బడిమానిన వారు
ఉంటారు. వారి వయసు తగిన తరగతుల్లో చేర్పించి ప్రత్యేక శిక్షణా కేంద్రాల
(ఎస్.టి.సి) ద్వారా పిల్లలకు విద్యవకాశం కల్పించడం జరుగుతుంది.
|
|
-
-
- రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదలైన నిధులను జమచేయుటకు ప్రత్యేకంగా
పాఠశాల విద్యాయాజమాన్య కమిటీ చైర్మన్ (సర్పంచ్), మెంబర్ కన్వీనర్ అయిన
ప్రధానోపాధ్యాయులతో బ్యాంకులో ఖాతా తెరచి జమ చేయాలి. పాఠశాల యాజమాన్య
కమిటీ తీర్మానం మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖర్చు చేసి దానికి
సంబంధించిన బిల్లులు మరియు వోచర్ లు సమకూర్చుకోవడం జరుగుతుంది.
|
|
-
- పాఠశాల స్థాయిలో నిధుల జమా ఖర్చులను మండల విద్యాశాఖ అధికారి
పర్యవేక్షిస్తారు. ఖర్చు వివరములు రిజిష్టరును పాఠశాల యాజమాన్య కమిటీ కూడా
పర్యవేక్షించవచ్చును.
|
|
-
- ప్రభుత్వ ఉత్తర్వు నెం. 83 ఆధారంగా ప్రాజెక్టు డైరెక్టర్ మరియు
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ మరియు
చైర్మెన్ ఆదేశాల ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ రాజీవ్ విద్యామిషన్ (సర్వ
శిక్షా అభియాన్) వారి అనుమతి మేరకు విద్యావాలంటీర్లను నియమిస్తుంది.
|
|
-
- పాఠశాలలో విద్యార్థుల హాజరు, నమోదు వివరాలు, విద్యార్థుల ప్రగతి, భవన
నిర్మాణాలు, నిధుల మంజూరు, వాటి వినియోగం, పనిచేస్తున్న ఉపాధ్యాయులు,
తరగతి వారీగా, విషయవారీగా విద్యార్థుల ప్రగతి, గ్రేడింగ్ పాఠశాల
విద్యానిధి వినియోగము, మధ్యాహ్న భజన పథకమునకు సంబంధించిన వువరములు,
పాఠశాలకు అందిన గ్రాంట్ల వివరాలతో పాటు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని
ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసి సమాచార హక్కు చట్టం ద్వారా
పొందవచ్చు.
|
|
-
- 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ 8 సంవత్సరాల ఎలిమెంటరీ
విద్య పొందే హక్కును కల్పిస్తూ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
- బడిఈడు గల పిల్లందరికీ 1 కి.మీ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ
పరిధిలో ఎలిమెంటరీ స్థాయి పాఠశాలను (1 నుండి 8 తరగతులు) అందుబాటులోకి
తీసుకురావటం కోసం విద్యాహక్కు చట్టం ప్రవేశ పెట్టబడింది.
|
|
-
- 1 నుండి 8 వతరగతి చదువుతూ దారిద్ర్యరేఖకు దిగువనున్న పిల్లలకు
సంవత్సరమునకు రెండు జతల ఉచిత యూనిఫాం అందజేయబడుతుంది.
- పాఠశాలకు కావాలసిన మౌళిక వసతులు, తగినంత మంది ఉపాధ్యాయులు, తరగతి
గదులు, విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు మొదలగునవి
కల్పిస్తుంది.
|
|
|
|
No comments:
Post a Comment